#COVIDUpdates: ఏపీలో కొత్త‌గా 7,796 కేసులు

మంగళవారం, 8 జూన్ 2021 (19:25 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు సోమ‌వారంతో పోలిస్తే మంగ‌ళ‌వారం కాస్త పెరిగాయి. కొత్త‌గా 24 గంటల వ్య‌వ‌ధిలో 89,732 మంది శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 7,796 కేసులు నమోదయ్యాయి. మ‌రో 77 మంది వైర‌స్ కార‌ణంగా మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 11,629కి చేరింది. కరోనా నుంచి కొత్త‌గా 14,641 మంది కోలుకున్నారు.
 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరులో 12 మంది చనిపోగా, పశ్చిమగోదావరి 10,  అనంతపురం 8, నెల్లూరు 8, శ్రీకాకుళం 7, తూర్పుగోదావరి 6, విశాఖ 6, విజయనగరం 5, గుంటూరు 4, ప్రకాశం 4, కర్నూలు 3, కడపలో 2 ప్రాణాలు విడిచారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,68,112 పాజిటివ్ కేసుల్లో 16,48,895 మంది డిశ్చార్జ్ కాగా, 11,629 మంది మరణించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు