అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నందమూరి తారక రామారావు పేరు పెట్టాలన్న అభిప్రాయాలు జోరుగా వస్తున్నాయి. రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే 8 వేల ఎకరాల భూమి ఇవ్వడానికి గుంటూరు జిల్లాలో రైతులు సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానికి ‘తారకరామ నగర్’గా పేరు పెట్టాలన్న ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ పేరును రాజధాని మొత్తానికీ కాకుండా, రాజధానిలో అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్ వంటి ప్రభుత్వ ప్రధాన నిర్మాణాలున్న ప్రాంతానికి ‘తారకరామ నగర్’ అనే పేరు పెట్టాలన్న తలంపులో ఉన్నారు.