అదే విధంగా మార్చి 13న వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా మార్చి 7న రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ ప్రసంగం ఉంటుంది. బడ్జెట్ సమావేశాలకు అనుగుణంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విభాగాల నుంచి వివరాలు తెప్పించుకునే పనిలో పడ్డారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.