కొనసాగుతున్న చంద్రబాబు జపాన్‌ పర్యటన...ఐదో రోజు షెడ్యూల్

శుక్రవారం, 28 నవంబరు 2014 (08:45 IST)
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. ఆయన శుక్రవారం ఆ దేశ ప్రధాని షిజోతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాల తీరు తెన్నులు, పరిశ్రమల పెట్టబడులపైనే ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. 
 
ఈ భేటీలో ముఖ్యంగా నవ్యాంధ్ర నిర్మాణంకు సహకరించాల్సిందిగా జపాన్ ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. కాగా ఏపీ బృందం జపాన్ ప్రభుత్వంతో పాటు పలు పరిశ్రమలతో నాలుగు ఒప్పందాలు చేసుకుంది. కొత్త రాజధానిలో సౌకర్యాల కల్పన, ఆహార శుద్ధి, వ్యవసాయ యాంత్రీకరణ, విద్యుత్ ఉత్పత్తిపైనే చంద్రబాబు దృష్టి సారించారు.

వెబ్దునియా పై చదవండి