బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అవుతారు. ఇక్కడ ప్రత్యేక ప్యాకేజీపై చర్చించే అవకాశం ఉంది. హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్తోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక ప్యాకేజీలపై కేంద్రం సమాలోచనలు చేస్తున్న తరుణంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 పరిధిలోని సంస్థల విభజన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఇదివరకే గవర్నర్కు కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా గవర్నర్ సదరు కమిటీపై సమగ్రంగా చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం.