ఇదిలా ఉంటే.. విభజన హామీ మేరకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. రైల్వే జోన్ ఇచ్చి, రెవెన్యూ లోటును భర్తీ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం ప్రయత్నాలు జరిపామని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఇంకా రైల్వే జోన్ ఇవ్వాలని, రెవెన్యూ లోటు భర్తీ చేయాలని తాము కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నట్లు చెప్పారు.