గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఎగసిపడిన సమయంలో.. ప్రత్యేక హోదా రాదనీ భావించి తిరుపతిలో పెట్రోల్ పోసుకుని మునికోటి అనే యువకుడు ఆత్మ బలిదానం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఏడాది నిండింది. మునికోటి చనిపోయిన సమయంలో రాజకీయ పార్టీలు ఎవరికివారు ఆ భాగ్యునిపై తెగ సానుభూతి చూపించారు. బంద్లు కూడా నిర్వహించారు. ఆ తరువాత ఏ పార్టీ అతని కుటుంబాన్ని పట్టించుకున్నా పాపాన పోలేదు.
ఈ క్రమంలో మునికోటి కుటుంబాన్ని ఆదుకునేందుకు జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. మునికోటి కుటుంబానికి రూ.5 లక్షల మేర ఆర్థిక సామాన్ని అందించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్యకు ఆదేశాలు జారీ చేశారు.