కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో ఏపీఎస్పీ 9వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గరైయ్యాడు. అతడి తల బండి ఆత్మకూరులో కనిపించగా.. కోడూరు వద్ద మొండాన్ని ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో తల, మొండంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా గత అయిదురోజుల క్రితం అదృశ్యమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య రెండు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధమా లేక ఇతర ఏమైనా కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.