ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ మంత్రి పరిటాల సునీతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. వైసీపీ తరపున అవకాశం దొరికనపుడల్లా తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడే రోజాకు.. పరిటాల సునీత కౌంటరిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా సభలో రోజా మాట్లాడుతూ దివంగత టీడీపీ నేత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాంపై విమర్శలు గుప్పించారు.
రోజా తెలుగుదేశం పార్టీలో ఉండగా ఏం మాట్లాడారో గుర్తుకుతెచ్చుకోవాలని సునీత చెప్పారు. టీడీపీ నాయకురాలిగా ఉన్నపుడు రాయలసీమలో పర్యటిస్తూ.. పరిటాల రవి బొమ్మకు దండవేసి నివాళులు అర్పించారని చెప్పారు. ఇదే క్రమంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డే పరిటాల రవిని చంపించారని ఆరోపించారని...ఆ విషయం ఇపుడు రోజా మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు.