ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని అంబటి ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆపి, రైతులను అర్థం చేసుకోవాలన్నారు. ఆయనను రైతుద్రోహిగా ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని, ప్రజా ఉద్యమం చేస్తుందని అంబటి స్పష్టం చేశారు.