ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లలో భద్రాచలం, పినపాక, అశ్వరావు పేట నియోజకవర్గాలు గందరగోళంగా మారనున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లోని సగ భాగాలు సీమాంధ్రలో చేరుతున్నాయి. ఇలా ఈ గ్రామాలు సీమాంధ్రలో విలీనం అవుతుండటం పట్ల అక్కడి ప్రజల్లో గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో ఈ ఓటర్లు అందరూ తెలంగాణావాదానికి ఓటేసి గెలిపించారు.
అశ్వరావు పేట ఎమ్మెల్యేగా ఎంపికైన తాటి వెంకటేశ్వర్లుది వేలేరు పాడు మండలం కాగా ఆయన మండలం సీమాంధ్రలో చేరిపోతుంది. కానీ ఆయన మాత్రం తెలంగాణ శాసనసభకు ప్రాతినిథ్యం వహించాల్సి వుంది. ఇలా ఎన్నో గ్రామాల ప్రజలు పలు అనుమానాలతో తల్లడిల్లుతున్నారు. ఇటు తెలంగాణా ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వీరి భయాన్ని పోగొట్టే చర్యలు తీసుకోవాలంటూ ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు.