తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను 150 అడుగుల లోతున పూడ్చిపెట్టి, 115 అడుగులు విగ్రహాన్ని అమరావతిలో పెడతారా అని భూమన ప్రశ్నించారు. సీసీ కెమేరాలను ధైర్యముంటే సీఎం కార్యాలయంలో పెట్టించాలని, మహానాడులో పెడితే ప్రజలకేమి తెలుస్తుందన్నారు. తుని ఘటనపై దమ్ముంటే సీబీఐ విచారణ జరపాలని డిమాండు చేశారు. వంగవీటి రంగా హత్యాకాండ వెనుక టీడీపీ ఉందని హరిరామజోగయ్య చెప్పారని, ఈ ప్రపంచంలోనే చంద్రబాబులా అబద్దాలు చెప్పే నాయకుడు లేడని ఎద్దేవా చేశారు.