టాలీవుడ్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన తరువాత అమిత్ షా తనకు ప్రతిపాదన చేసారని అన్నారు. ఐతే ఆ ప్రతిపాదన ఏమిటో ఇప్పుడే చెప్పనని అన్నారు పవన్. అమిత్ చేసిన ప్రతిపాదన ఏమిటనే ఆసక్తి కలిగినా అది పవన్ చెప్పేవరకూ సస్పెన్సే. ఇకపోతే ఇటీవల జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చి విజయానికి బాటలు వేశారు. ఇకముందు కూడా కూడా రెండు పార్టీలకు మద్దతు ఇవ్వాలని అమిత్ కోరి ఉంటారనే అనుకుంటున్నారు. అదే ఆ ప్రతిపాదన అని కూడా కొందరు అంటున్నారు.
ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాలపై జనసేన దృష్టి సారిస్తుందని పవన్ కల్యాణ్ గురువారం తెలిపారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఇంకా ఆలోచించలేదని అన్నారు.