ఆయనో ప్రజాప్రతినిధి. రాష్ట్ర మంత్రి కూడా. ప్రజా సమస్యలపై ఎప్పుడు పట్టించుకోవాలో బాగా తెలిసిన రాజకీయ నేత. కుల, మతాలను పూర్తిగా పక్కనే పెట్టి అందరిని కలుపుకుని పోవాలి. అలాంటి వ్యక్తి ఒక మత కార్యక్రమానికి హాజరై మరో మతాన్ని కించపరుస్తూ మాట్లాడారు. అది ఎక్కడో కాదు... పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలోనే.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణా రెడ్డి హిందువులను కించపరిచేలా మాట్లాడారు. క్రిస్టియన్లు ఎంతో గొప్ప వ్యక్తులని, పేద ప్రజలకు సేవ చేయడానికి వెనుకాడరని, అదే హిందువులైతే అలా కాదని దెప్పి పొడిచే మాటలు మాట్లాడారు.