ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో యూపీఏదే పాపమని.. చట్టం పెట్టివుంటే ఇంత తతంగం వచ్చేది కాదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో... ఏపీకి ప్రత్యేక హోదా రాదని తెలిసిన రాజకీయ నేతలు మాత్రం తమకుతోచిన వ్యాఖ్యలు, డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, హోదాపై కేంద్రానికి తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ పెట్టాలని డిమాండ్ చేశారు.