టీడీపీ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. భూమాకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఎస్కార్ట్ లేదన్న వంకతో భూమాను హైదరాబాద్ నిమ్స్కు తరలించలేదని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా భూమా కుమార్తె అఖిల ప్రియ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు.
అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో మెలగాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని రాష్ట్రపతి అన్నారంటే ఓటుకు నోటు కేసు సమసిపోయినట్టుకాదని వైకాపా తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. రాష్ట్ర సంబంధాలు వేరు, ఓటుకు నోటు కేసు వేరు అన్న రీతిలో రాష్ట్రపతి ప్రసంగం కొనసాగిందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా రెండు రాష్ట్రాల మధ్య సెక్షన్-8ని ముడిపెట్టేలా మాట్లాడొద్దని హితవు పలికారు.