జీతాలిచ్చేందుకు డబ్బుల్లేవంటారు.. రాజధాని సర్వే కూడా నిధులు ఇవ్వలేకపోతున్నామని మాటలు చెబుతారు. కానీ మన ఆంధ్ర ప్రదేశ్ నాయకులు మాత్రం బడ్జెట్ లో బడాయికి పోతున్నారు. బడ్జెట్ ను లక్ష కోట్లను దాటించి గొప్పలకు పోతున్నారు. ఈ నెల 12న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రాజెక్టుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలలలో 12 తేదీన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర పరిది పడిపోయింది. 13 రాష్ట్రాలకే పరిమితమయ్యింది. మరోవైపు నిధుల్లేవని చెబుతున్నారు. కానీ మన మంత్రిగారు మాత్రం ఈ బడ్జెట్ ను లక్ష కోట్ల మైలు రాయిని దాటించనున్నారు.