తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద బంజారాహిల్స్ పోలీసులు 504, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు మరికొంత మందికి ముడుపులు అందాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంతో నాంపల్లి కోర్టు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.