జపాన్ పారిశ్రామికవేత్తలకు ఆ దేశంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, ఫ్యాక్టరీలు స్థాపించే జపాన్ పారిశ్రామికవేత్తలకు జపాన్ రాజధాని టోక్యోలోనే అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఇందుకోసం టోక్యోలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అనుమతులు తీసుకోవడానికి ఆంధ్రాకు రానవసరంలేదని, అన్ని లైసెన్స్లనూ ఇక్కడే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
కాగా, సోమవారం నుంచి జపాన్లో పర్యటిస్తున్న చంద్రబాబు అండ్ కో ఆ దేశ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వంతో వివిధ అంశాలపై చర్చలు జరుపుతూ, కీలక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. ఇందులోభాగంగా.. ఇసుజు కంపెనీ తడలోని శ్రీసిటీ సెజ్లో టక్కుల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే.