నందిగామలో టీడీపీ విన్.. 100 రోజుల పాలనకు ప్రజల తీర్పు : చంద్రబాబు

మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (12:39 IST)
కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఘనవిజయం సాధించడం ప్రభుత్వ వంద రోజుల పాలనపై ప్రజల ఇచ్చిన తీర్పురు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా సౌమ్యను అభినందించిన బాబు, ఆమెను గెలిపించిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 
 
రుణమాఫీ, పింఛన్ల పెంపు, నిరంతర విద్యుత్, ధరల నియంత్రణ నిర్ణయాలకు ప్రజలు ఆమోదం తెలిపారన్న దానికి నిదర్శనమే ఈ విజయం అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని, అక్కసుతో చేస్తున్నవని బాబు అన్నారు. 
 
కాగా, నందిగామ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆమె 74,827 ఓట్ల భారీ మెజార్టీని సాధించారు. చివరి రౌండ్లలో కాస్త పుంజుకోవడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావు కష్టపడి డిపాజిట్ దక్కించుకోగలిగారు.

వెబ్దునియా పై చదవండి