రాజధానిపై చర్చ వద్దు.. మీడియాలో అసత్య ప్రచారం : చంద్రబాబు

గురువారం, 28 ఆగస్టు 2014 (15:18 IST)
రాష్ట్ర రాజధాని అంశంపై చర్చ వద్దని తన మంత్రివర్గ సహచరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హితవు పలికారు. అదేసమయంలో ఆయన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా అసత్య కథనాలను ప్రసారం చేస్తూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 
 
రాజధానిపై జరుగుతున్న గ్లోబెల్ ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమన్నారు. కొత్త రాజధాని విజయవాడ, దొనకొండ, విశాఖ... అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. బాధ్యత లేకుండా మీడియా రాజధానిపై ప్రచారం చేస్తోందని చంద్రబాబు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రానిదే ఏమీ చెప్పలేనని ఆయన అన్నారు. 

వెబ్దునియా పై చదవండి