ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో నాలుగేళ్ళలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అంతకన్నా ముందే పట్టిసీమ పూర్తి చేసి ఆ నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాలకు అందించడం ద్వారా కృష్ణా నది నీటిని ఆదా చేసి, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరింత నీరు రాయలసీమకు తరలిస్తామన్నారు.