వివేకా హత్య కేసు : సీబీఐ అధికారి, వివేకా కుమార్తె అల్లుడిపై కేసు - చార్జిషీటు కూడా...

శనివారం, 30 డిశెంబరు 2023 (08:28 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌తో పాటు వివేకా ఏకైక కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. సీబీఐ ఎస్పీ రాం సింగ్ తనపై ఒత్తిడి తెచ్చారని, సునీతా రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు తనను బెదిరించారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి గతంలో ఫిర్యాదు ఇచ్చాడు. ఈ ఫిర్యాదు మేరకు అప్పట్లోనే పులివెందుల కోర్టులో ఓ ప్రైవేటు కేసు నమోదైంది. ఈ అంశంలో కేసు నమోదు చేయాలంటూ తాజాగా కోర్టు ఆదేశించింది. దీంతో ఆ ముగ్గురిపై పులివెందుల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వివేకా హత్య కేసులో వైకాపా నేతల పేర్లు చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనపై ఒత్తిడి చేశారని, విచారణ సందర్బంగా సీబీఐ క్యాంపు కార్యాలయంలో తన బిడ్డల ఎదుటే తీవ్రంగా కొట్టారంటూ కృష్ణారెడ్డి అప్పట్లో పులివెందల కోర్టులో ఓ ప్రైవేటు కేసు పెట్టారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంటికి వెళ్లినపుడు, సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి తనను బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పులివెందుల న్యాయస్థానం కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే పులివెందుల అర్బన్ పోటీలుసు రాంసింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేసి, తాజాగా చార్జిషీటును కూడా దాఖలు చేశారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు