తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విపక్ష వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ అని చెవిరెడ్డి అభివర్ణించారు. ఈ కేసు నుంచి బయటపడేందుకే ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని కూడా చెవిరెడ్డి ఆరోపించారు.