సీఐ పిల్లలు కూడా తమ తండ్రే తమ తల్లిని చంపేసి ఉంటాడని ఆరోపించడంతో ఆయనపై అనుమానాలు ముసురుకున్నాయి. కాగా మంగళవారం అర్థరాత్రి సీఐ దంపతులపైకి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సీఐ తీవ్రంగా గాయపడగా, ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందారు.
కడప పీటీసీ సీఐగా పనిచేస్తున్న అర్జున్ నాయక్ స్వస్థలం నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి. కాగా ఆయన మంగళవారం భార్య పద్మ(39)తో కలిసి తన స్వగ్రామంలో వ్యవసాయ పనులు చేయించారు. కంది పంటను ఎండబెట్టి రాత్రి వరకూ అక్కడే నూర్పిడి చేయించి అక్కడే భోజనం చేసి నిద్రించారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది.