విశాఖపట్నం జిల్లాలో సంభవించిన బాణాసంచ గోడౌన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలుపుతూ.. ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్, నక్కపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు చేపట్టకుండా మందుగుండును నిలువ ఉంచడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.