435వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:44 IST)
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 435వ రోజుకు చేరుకున్నాయి. కరోనా సూచనలు పాటిస్తూ ఉద్యమం సాగుతోంది. విశాఖ ఉక్కు సాధిస్తామని  అమరావతి రైతులు తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అమరావతి రైతులు, మహిళలు  రిలే దీక్షలు చేస్తున్నారు. 

మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు