తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఓ కమిటీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి, విద్యుత్ వంటి ఇతరత్రా సమస్యలు తలెత్తడంతో ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని చంద్రబాబు నియమించారు.
లేక్వ్యూలో చంద్రబాబుతో ఎంపిల సమావేశం ముగిసింది. ఈ కమిటీకి కో ఆర్డినేటర్గా ఎంపి సుజనా చౌదరిని నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా అశోక్ గజపతి రాజు, తోట నరసింహం, మల్లారెడ్డి, కంభంపాటి రామ్మోహనరావు, బీజేపి ఎంపిలు కంభంపాటి హరిబాబు, బండారు దత్తాత్రేయ ఉంటారు.