పరమానందయ్య శిష్యుల కథలా టీడీపీ పాలన : నారాయణ

మంగళవారం, 31 మార్చి 2015 (15:32 IST)
రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ పాలన పరమానందయ్య శిష్యుల కథలా ఉందని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె నారాయణ విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి పట్టణమంత కూడా లేని సింగపూర్‌కు చంద్రబాబు తరచుగా ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
 
సింగపూర్‌కు కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా తరహాలోనే చంద్రబాబు కూడా విమానాల్లో చక్కర్లు కొడుతున్నారని... చివరకు మాల్యాకు పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుందేమో అని అన్నారు. 
 
ఇకపోతే.. టీడీపీ పాలన పరమానందయ్య శిష్యుల కథలా తయారైందని విమర్శించారు. రుణమాఫీ అమలు చేసి చెట్టుకింద పాలించినా ఎంతో బాగుంటుందని... పెద్దపెద్ద భవనాల్లో పాలన చేయడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి