రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ పాలన పరమానందయ్య శిష్యుల కథలా ఉందని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె నారాయణ విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి పట్టణమంత కూడా లేని సింగపూర్కు చంద్రబాబు తరచుగా ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.