రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని, అందువలనే రాష్ట్రంలో ఇటువంటి దుర్బర పరిస్థితులు చోటు చేసుకున్నాయని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పరోక్షంగా చంద్రబాబు పేరు ప్రస్తావించకుండానే విమర్శించారు. రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి పి. మాణిక్యాలరావు అధ్యక్షతన ఏర్పాటైన కరువు పరిశీలన బృందం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కూడలికి సోమవారం సాయంత్రం చేరుకుంది. అక్కడ తొలుత జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పురందేశ్వరి ఆ తర్వాత విమర్శల దండకాన్ని మొదలెట్టారు.