బొగ్గు కేసు గురించి మాట్లాడొద్దు... పవన్‌తో సినిమా వుంది.. దాసరి నారాయణ రావు

సోమవారం, 2 మే 2016 (20:48 IST)
సినిమా రంగంలో దర్శకరత్నగా పేరుతెచ్చుకున్న దాసరి నారాయణరావు. రాజకీయాల్లో.. బొగ్గు మచ్చ ఏర్పడింది. అయితే దాని గురించి వార్తల్లో రకరకాలుగా వస్తున్నాయి. దీనిపై ఆయన వివరణ ఇవ్వడానికి ఇష్టపడటంలేదు. కేసు నడుస్తున్నందున దానిగురించి అడగొద్దుని అన్నారు. సోమవారంనాడు అత్యవసరంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈనెల 4న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా పలు విషయాలు చెబుతూ... 'ఉదయం' దినపత్రికను మళ్ళీ తెస్తున్నారని గతంలో చెప్పారని ప్రశ్నించగా.. దాన్ని చూసేందుకు సరైన యంత్రాంగం లేదు. దాన్ని నడిపే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. కానీ.. 'ఉదయం' వెబ్‌సైట్‌ను రేపు.. అంటే.. 3వ తేదీనాడు లాంఛ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
పవన్‌తో సినిమా వుంది..
పవన్‌ కళ్యాణ్‌తో సినిమా వుందా? లేదా? అనే సందిగ్థత ఇండస్ట్రీలోనూ వుంది. ఈ విషయమై ఆయన క్లారిటీ ఇస్తూ... పవన్‌తో సినిమా వుంది. ఆ పనిలో దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా వున్నారు. కథను సిద్ధం చేస్తున్నారని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి