తెలంగాణ రాష్ట్ర ప్రజల కరెంట్ కష్టాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వెల్లడించారు. అయితే, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు, పట్టీపట్టనట్టు నడుచుకున్నారని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనను మీడియా ముఖంగా ఖండించిన మంత్రి, విద్యుత్ అంశంపై తాను మంత్రి హరీశ్ రావుకి ఫోన్ చేసి అడిగినా ఇంతవరకు స్పందన రాలేదన్నారు. పక్క రాష్ట్రాలు విద్యుత్ ఇస్తామంటున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, తెలంగాణకు విద్యుత్ ఇవ్వడానికి మా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని ఉమ చెప్పారు.