దేశ ప్రగతి కోసం బీజేపీలో చేరాను: డీజీపీ దినేష్ రెడ్డి

శనివారం, 23 ఆగస్టు 2014 (11:19 IST)
దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రగతి కోసం భారతీయ జనతా పార్టీ లో చేరానని మాజీ డిజిపి వి.దినేష్ రెడ్డి చెప్పారు. మోడీగారి నాయకత్వంపై దేశ ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో గత ఎన్నికలలో రుజువు అయిందని, అందువల్ల తాను కూడా ఆ పార్టీలో చేరాలని ఆయన అన్నారు. 
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారంటే, అది ఒక ప్రాంతీయ పార్టీ కనుక దానిని వదలిపెడుతున్నానని దినేష్ రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ పార్టీ కనుక అందులో చేరానని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి