పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం సృష్టించింది. విజయ పేరుతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న లక్ష్మణరావును కొంతమంది దుండగులు పెట్రోల్ బంక్ సమీపంలో అడ్డగించి గొడ్డలితో నరికారు.