ఈలోగా విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దృష్టి పెట్టాలని తెలిపారు. ఆప్షన్ల ఎంపిక తర్వాత చేపడతామన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారని వేణుగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్లు ప్రొ.ఎల్. వేణుగోపాల్ రెడ్డి వివరించారు.