బంజారాహిల్స్లోని సాక్షి టవర్స్ను కూడా అటాచ్ చేశామని, బెంగళూరులోని ఖరీదైన మంత్రి కామర్స్ వాణిజ్య సముదాయాన్ని కూడా ఇందులో కలిపామని తెలిపారు. ఇంతేకాక పలు కంపెనీల్లో జగన్, భారతి షేర్లను అటాచ్ చేసినట్లు సమాచారం. భారతి సిమెంట్స్ ఛార్జిషీటు ఆధారంగా దర్యాప్తు జరిపిన ఈడీ, ఆ కంపెనీకి రూ.152 కోట్ల సున్నపు రాయి నిక్షేపాలు అక్రమంగా కేటాయించినట్లు నిర్ధారించింది.