ఒకరి తరువాత... కరెంట్ షాక్‌తో ఆరుగురు మృతి

మంగళవారం, 30 జూన్ 2015 (09:25 IST)
మృత్యువు ఒకరి తరువాత ఒకరిని తన దగ్గరకు చేర్చుకుంది. అందరికి ఉచ్చువేసి అమాంతం తీసుకెళ్ళిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరెంట్ షాక్‌తో మరణించిన సంఘటన విజయవాడలో సభవించింది. వివరాలిలా ఉన్నాయి. 
 
విజయవాడ నగరం భవానీపురం ఊర్మిళానగర్‌లో ఒకరికి కరెంట్‌షాక్‌ కొట్టి విలవిలాడుతుండగా, ఒకరిని రక్షించబోయి మరొకరు ఇలా ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇంటి సిమెంటు రేకులు తొలగిస్తుండగా కరెంట్‌ షాక్‌తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటిపై ఉన్న రేకులు విద్యుత్‌ వైర్లకు తగిలి కరెంట్‌షాక్‌ కొట్టింది. 
 
సాధారణంగా సినిమాల్లో కనిపించే కామెడీ దృశ్యంలాంటి సంఘటన నిజ జీవితంలో ఆరుగురి ప్రాణాలు తీసింది. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.  వచ్చి మరణించారు. ప్రమాదస్థలాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు.

వెబ్దునియా పై చదవండి