చిత్తూరు జిల్లాలో మరోసారి గజ రాజులు వీరంఘం సృష్టించాయి. కుప్పం మండలం, మిట్టపల్లి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్థరాత్రి పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. అనంతరం ఏనుగుల గుంపు సమీపంలోని రైల్వే ట్రాక్పైకి రావటంతో గమనించిన రైల్వే సిబ్బంది ఈ సమాచారాన్ని అధికారులకు అందించారు.
కాగా పదిహేను రోజుల క్రితం అడవి నుంచి దారి తప్పి గ్రామాల బాట పట్టిన ఏనుగులు చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై అధికారులు తగు చర్యలు చేపట్టి, వాటిని అడవిలోకి తరలించాలని కోరుతున్నారు.