ఓ ఇంజనీరింగ్ విద్యార్థినికి జీవితంపై విరక్తి పుట్టింది. ఎక్కడ ఏం తేడా వచ్చిందో తెలియదుగానీ, అప్పటికప్పుడు చనిపోవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన గదిలోని హెయిర్ కలర్ ను కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
భారతి అనే విద్యార్థిని నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. అయితే ఆమె ఏమనుకుందో, ఏందుకు అలా చేసిందో ఇంకా తెలియలేదు. గురువారం అర్థరాత్రి హాస్టల్ గదిలోనే హెయిర్ కలర్ ను నీళ్ళలో కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చావు బతుకుల మధ్యనున్న ఆమెను కాలేజీ యాజమాన్యం నెల్లూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.