హెయిర్ డై తాగి ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య!

శుక్రవారం, 30 జనవరి 2015 (11:29 IST)
హెయిర్ డై తాగి ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లా కావలిలో భారతి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. 
 
ఉదయగిరి మండలం కొండారెడ్డిపాలెం గ్రామానికి చెందిన భారతి కావలి విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తోంది. ఆమె తలకు వేసుకునే రంగు (హెయిర్ డై) తాగింది. 
 
ఈ విషయం గుర్తించిన కళాశాల మేనేజ్ మెంట్ విద్యార్థినిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భారతి ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.

వెబ్దునియా పై చదవండి