ఫేస్బుక్లో పరిచయమైన వంశీమనోహర్ తాను ఏపీ క్రికెట్ టీమ్ ఫ్లైయర్స్ ట్రస్ట్ నిర్వహిస్తున్నానని, క్రీడల్లో రాణించాలన్నా తన ట్రస్ట్ నుంచి పంపిస్తామని చెప్పి యువతి నుంచి రూ.60 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత వంశీమనోహర్ ఆచూకీ లభించక పోవడంతో ఆ యువతి మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు.