హైదరాబాద్ లక్డీకపూల్లోని ఏజీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో అర్ధరాత్రి డీ బ్లాక్లో రేగిన మంటలు మంగళవారం ఉదయం దాదాపు మూడు గంటల వరకు కొనసాగించాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.