సోమవారం తెల్లవారుజామున 3గంటలకు కృష్ణా ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాద్ నుంచి దంపతులు ఇద్దరు నిజామాబాద్కు వచ్చారు. రైలుదిగి ఇంటికి వెళ్ళేందుకు బయలుదేరారు. అయితే అప్పటికే వారిపై కన్నేసిన నలుగురు వారిని అటకాయించారు. భర్తపై దాడి చేశారు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. తిరగబడినా ఫలితం లేకుండా పోయింది. తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తరువాత ఆమె మెడలోని బంగారు నగలను దోచుకెళ్ళారు.