పోలవరం ప్రాజెక్టులోని ఏడు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్ర్రప్రదేశ్లో చేర్చారని అవి తన నియోజకవర్గం పరిధిలోని మండలాలేనని వాటి సమస్యలపై చర్చించడానికి తనకు ఏపీ శాసనసభలో స్థానం కల్పించాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య రాష్ట్రపతిని కోరారు. తమ పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ముఖర్జీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో కలిసిన మండలాల్లో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. నాన్లోకల్ పేరిట డీఎస్సీకి అర్హత సాధించలేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.