నాగార్జునసాగర్‌లో కరెంట్ ఉత్పత్తిని ఆపండి: కేసీఆర్‌కు గుత్తా లేఖ!

శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:38 IST)
నాగార్జునసాగర్ డ్యాం వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుదుత్పత్తిని వెంటనే నిలిపివేయాలంటూ టీకాంగ్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 
 
విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుతూ పోతే, ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు లేక ఎండిపోతాయని గుర్తు చేశారు. రబీ పంట కోసం రైతులకు నీరు అందేలా చూడాలని సూచించారు. అలాగే, శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 834 అడుగులు ఉండేలా చూడాలని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి