భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నమ్మబట్టే పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని విశాఖపట్నం ఎంపి కంభంపాటి హరిబాబు అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే పవన్, టీడీపీ బీజేపీకి మద్దతు పలికాయని హరిబాబు వ్యాఖ్యానించారు.
యుపిఏ ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్ట్ హామీ ఇచ్చిందని హరిబాబు గుర్తు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు గత ఏడెనిమిదేళ్లుగా ముందుకు సాగలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ప్రాంతాలు లబ్ధి పొందుతాయని హరిబాబు అన్నారు.