తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెసు, బిజెపి చేసిన విమర్శలపై హరీష్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెసు నేతలు ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్సలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంట్రాక్టు కార్మికుల విషయంలో కాంగ్రెసు తన వైఖరి స్ఫష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణలో కరెంట్ కోతలకు గత ప్రభుత్వమే కారణమని, కరెంట్ కోత లేకుండా చూసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాదులో గుండాగిరి, భూకబ్జాలు ఉండకుండా చూడాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ పునర్నిర్మాణం తమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు.