నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే శ్రీ విద్యానికేతన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా అయ్యన్న పని చేస్తున్నారు. ఇదే పాఠశాలలో పని చేస్తున్న కౌసల్య అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరు పాఠశాలలోనే శృంగారంలో పాల్గొనివుండగా, సాయికృష్ణ అనే విద్యార్థి కళ్ళారా చూశాడు. దీంతో కౌసల్యకు భయం పట్టుకుంది.
దీంతో భయపడ్డ అయ్యన్న అనారోగ్యంతో సాయికృష్ణ మృతిచెందాడంటూ ఆసుపత్రికి తరలించి డ్రామాకు తెరతీశాడు. అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు అన్ని విషయాలు వెలుగులోకి తేవడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.