సొంతగడ్డపై తొలి పద్దు... ఏపీ రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక లోటు రూ.23,054 కోట్లు
బుధవారం, 15 మార్చి 2017 (11:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2017-18 సంవత్సరానికిగాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో ఏపీ రాష్ట్ర తొలి పద్దును సొంతగడ్డపై తొలిసారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్ధుడైన చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు.
విజన్ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కోసం ఏపీ ప్రభుత్వం తన ముందుంచుకున్న కర్తవ్యాలను ప్రతిబింభించే బడ్జెట్ ఇదని ఆయన చెప్పారు. చారిత్రక నగరమైన అమరావతికి దాదాపు 2000 ఏళ్ల తర్వాత శాసనాధికారం తిరిగి సంప్రాప్తించిన సందర్భంలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల అన్నారు. కాగా, యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైలెట్స్, వివిధ శాఖలకు కేటాయింపులను అంకెల్లో పరిశీలిస్తే...