బ్యాంకు మేనేజర్ హిమబిందు కేసులో ముగ్గురు ఖాకీలపై వేటు!

శుక్రవారం, 29 ఆగస్టు 2014 (15:58 IST)
కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచి మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు దారుణ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై వేటు పడింది. పడమట పీఎస్ సీఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ విజయవాడ పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ యేడాది మార్చి నెలలో యనమలకుదురులో హిమబిందు హత్యకు గురైన విషయం తెల్సిందే. మార్చి 15న ఆమె నుంచి కనిపించకుండా పోగా.. మూడు రోజులకు కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. హిమబిందుపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులందరీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి