ఈ యేడాది మార్చి నెలలో యనమలకుదురులో హిమబిందు హత్యకు గురైన విషయం తెల్సిందే. మార్చి 15న ఆమె నుంచి కనిపించకుండా పోగా.. మూడు రోజులకు కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. హిమబిందుపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులందరీ పోలీసులు అరెస్ట్ చేశారు.